13, జులై 2011, బుధవారం

అనంతరం -ఆవిష్కరణ సభ-16 October-2010


'అనంతరం' నా మూడవ కవితా సంపుటి. ఈ పుస్తకానికి 'ఆవిష్కరణ సభ' పెట్టాలా, వొద్దా అన్న మీమాంస కొంత ఉండింది...అయితే, ఈ పుస్తకాన్ని నాకు ఎంతో ఇష్టులైన కాళోజీ సోదరులకు అంకితం ఇవ్వాలని అనుకోవడం వలన ...నారాయణ రెడ్డి గారు ఆవిష్కరిస్తే కొంత అర్థవంతంగా వుంటుంది అనుకున్నాను ..అదీగాక,,,నేను వరంగల్ REC లో చదివే రోజుల్లో వొక సారి ఏదో సెమినార్ కి వొచ్చిన నారాయణ రెడ్డి గారిని నేనే కాళోజి సోదరుల ఇంటికి తీసుకు వెళ్లాను...అప్పుడు ఆయన మాతో చాలా సేపు కాళోజీ ల ఇంట జరిగిన మిత్రమండలి లలో తాను కవిత్వం చదివిన జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు ... ఆ సన్నివేశం ఎందుకో అలా నా మనసులో అపురూపంగా నిలిచిపోయింది..మొదటి పుస్తకం 'వాతావరణం'...1997 లో కాళోజీ గారు ఆవిష్కరించారు..రెండవ పుస్తకం 'ఆక్వేరియం లో బంగారు చేప'...డిసెంబర్ 2000  లో వరవర రావు గారు ఆవిష్కరించాలి గానీ, చివరి నిమిషం లో మార్పు జరిగి దర్భశయనం ఆవిష్కరించారు..   



సరే...అనుకోవడమైతే అనుకున్నాను గానీ ఆయన్ని ఎలా పిలవాలా అని చిన్న సందేహం....[వ్యక్తిగతంగా నాకు ఆయనతో పరిచయం లేదు] ...శివారెడ్డి గారినీ, దర్భశయనం గారినీ అడిగితే 'నువ్వే పిలువు' అన్నారు...కొంత తటపటాయిస్తూనే ఫోన్ చేసాను...ఫోనులో నారాయణ రెడ్డి గారు నేను తనకు ఎంతో కాలంగా పరిచయం వున్నట్టు receive చేసుకున్న విధం నన్ను కొంత ఆశ్చర్యానికి గురి చేసింది...అంతే గాక, ఆయన 'మరే ఇతర వివరాలూ అడగకుండా' ...'నా పాత్ర ఏమిటి?'...అని మాత్రమె అడిగి, 'ఫలానా రోజు నాకు ఖాళీ వుంది' అని చెప్పడం మరింత ఆశ్చర్యంగా అనిపించింది...

ఇక చివరి ఆశ్చర్యాలు మరి రెండు వున్నాయి...సభ సాయంత్రం ఆరు గంటలకు అని చెబితే, సరిగ్గా ఆరు గంటలకు వొచ్చి వున్నారు...[నిజానికి, major ఆక్సిడెంట్ అవడం మూలాన నారాయణ రెడ్డి గారు మనిషి సాయం లేకుండా కూర్చోలేని స్థితి లో వున్నారు]...సభ మొత్తం అయిపోయే దాకా వున్నారు..శివారెడ్డి గారు అధ్యక్షులు ...దర్భశయనం వక్త ...గుడిపాటి స్వాగతం ...ఇదీ నా  చిన్న సభ ఆ రోజు..'సభ కొంత ఆలస్యంగా మొదలవుతుంది' అని చెబితే ...శివారెడ్డి గారినీ, దర్భశయనం గారినీ చూపిస్తూ..'ఫరవా లేదు..నేను కాసేపు వీళ్ళతో గడుపుతాను' అన్నారు  

చివరి ఆశ్చర్యం వొకటి వుందన్నాను కదా......నారాయణ రెడ్డి గారు తనకు ఇచ్చిన పుస్తకాన్ని మొత్తం చదివి, తనకు బాగా నచ్చిన కవితల దగ్గర 'notes  రాసుకుని రావడం...  
నిజానికి ఆరోజు శివారెడ్డి గారికి ఆరోగ్యం అసలు బాగోలేదు...వొంట్లో బాగోలేనట్టుగా వుంటే రావొద్దని కూడా అంటే ఆయన సమాధానం 'శివారెడ్డి వేదిక ఎక్కే వరకే ఇట్టాంటి గొడవలు...'....that is shiva reddy....ఆ రోజు ...I felt, I am honoured....ఇలాంటి మహానుభావుల నుండి ప్రవహించిన  ఈ కవిత్వ వారసత్వం, మా తరం నుండి విజయవంతంగా ముందుకు వెళుతుందా?